హైదరాబాద్ లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం పోసి మందుబాబులను దారుణంగా మోసం చేస్తున్నారు. బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. లింగంపల్లి ప్రొహిబిషన్& ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ట్రూప్స్ బార్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని ఎక్సైజ్ అధికారులు ఇటీవల తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది.
రూ. 2690 ధర గల జేమ్సన్ బాటిల్లో
ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం కలుపుతూ బార్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. రూ. 2690 ధర గల జేమ్సన్ బాటిల్లో రూ.1000 ధర కలిగిన ఓక్స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు. కల్తీకి రెడీగా ఉంచిన 75 తక్కువ ధర మద్యం సీసాలు, 55 ఖాళీ సీసాలను అధికారులు సీజ్ చేశారు. బార్ లైసెన్స్, ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్లో పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్లపై కేసు నమోదు చేసిన అధికారులు లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో వారిని అప్పగించారు
Also read
- Andhra: వింతగా ప్రవర్తిస్తున్న బాలిక.. చర్చికి తీసుకెళ్లి.. కరవకుండా నోటికి గుడ్డ కట్టారు.. కాసేపటికి..
- Cheap Liquor: నాశనం అయిపోతార్రా.. మరీ ఇంత మోసమా.. ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్!
- TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
- Vijayawada: ఇన్ స్టాలో పరిచయం.. యువతిని హోటల్కి రమ్మన్నాడు.. అక్కడ ఆమె దుస్తులు విప్పేసి..
- యువ ప్రేమజంట ఆత్మహత్య!