గత కొన్ని రోజులుగా ప్లేస్టోర్ సులభంగా లోన్ ఇస్తామంటూ అనేక యాప్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. కాకపోతే వీటిలో కొన్ని మోసపూరితమైన యాప్ లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ క్యాష్ఎక్స్పాండ్-యూ కూఆ ఒకటి. దీనిని వెంటనే మీ ఫోన్ లో తొలగించకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే..
Also read :Telangana: అంతా కలిసి చనిపోయేలా చేశారు.. ఎస్ఐ శ్రీనివాస్ మృతి కేసులో సంచలన విషయాలు..
ఈమధ్య ఆన్ లైన్ తరహా మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడిపోయిన కొంతమంది కేటుగాళ్లు లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా లోన్ యాప్స్ పేరుతో సులభంగా, ఎక్కువగా రుణాలు ఇస్తామంటూ అమాయకపు ప్రజలను బురిడీ కొట్టిస్తూ లక్షలు, లక్షలు కొల్లగొడుతున్నారు. అంతేకాకుండా.. ఈ లోన్ పేర్లతో అధిక వడ్డీలు చెల్లించాలని ఒత్తిడి చేసి వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.అయితే ఇలా సురక్షితం లేని లోన్ యాప్ లను నమ్మి మోసపోవద్దని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయిన ఫేక్ యాప్స్ తో కూడిన ఒక యాప్ ప్లేస్టోర్ లో ఇంక దర్శనం ఇస్తూనే ఉంది. కాగా, దానిని వెంటనే యూజర్లు తొలగించాలని తాజాగా ప్రభుత్వం సూచించింది. ఇంతకి అదేమిటంటే..
Also read :డ్వాక్రా మహిళల అండగా.. బలరాముడి ఉద్యమం
గత కొన్ని రోజులుగా ప్లేస్టోర్ సులభంగా లోన్ ఇస్తామంటూ అనేక యాప్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. కాకపోతే వీటిలో కొన్ని మోసపూరితమైన యాప్ లు కూడా ఉన్నాయి. కాగా, వీటిని నమ్మి ప్రజలు మోసపోతున్నారని పలుమార్లు ప్రభుత్వం ప్రజలకు హెచ్చరించి విషయం తెలిసిందే. మరి అలాంటి మోసపూరితమైన యాప్స్ లో క్యాష్ఎక్స్పాండ్-యూ ఒకటి. కాగా, ఆన్లైన్లో రుణాలు అందించే ఈ యాప్ నకిలీదని, దాన్ని యూజర్లు వెంటనే తొలగించాలని తాజాగా ప్రభుత్వం సూచించింది.
Also read :DSPతో సహా 50 మందితో వివాహం! ఫస్ట్ నైట్ అవ్వగానే భర్తని మార్చేస్తూ!
ముఖ్యంగా ఈ క్యాష్ఎక్స్పాండ్-యూ’ పేరిట ఆన్లైన్లో రుణాలు అందించే యాప్ నకీలిది మాత్రమే కాదనీ, దీనీ వల్ల భారీగా మోసపోయే అవకాశాలు ఉన్నాయని కనుక ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలకు సంబంధించిన యాప్ ను తక్షణమే యూజర్లు మొబైల్ లో ఉన్నా తొలగించడమే కాకుండా.. ప్లేస్టోర్ నుంచే కూడా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఎదుకంటే ఈ యాప్ మూలాలు త్రు దేశంలో ఉన్నట్లు తెలిసిందని ప్రభుత్వ సైబర్ క్రైమ్ విభాగం సైబర్ దోస్త్ వెల్లడించింది. అంతేకాకుండా.. దీని వలన కీలక సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందని అలా కాకుండా ఉండాలంటే వెంటనే దీనిని తొలగించాలని తెలిపింది.
Also read :Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…