గుడ్లవల్లేరులోని పుల్లేరు కాలువలో స్నానం చేస్తూ ఆదివారం గల్లంతైన బాలుడి మృతదేహాన్ని ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు సోమవారం గుర్తించాయి.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక నీలకం ఠేశ్వరపురానికి చెందిన కోలాజోషి(17) తన ఇంటికి సమీపంలోని పుల్లేరులో స్నానానికి దిగి లోపలికి వెళ్లి పడిపోయాడు. కాల్వలో నీరు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఇద్దరు షాంపూ కొనేందుకు వెళ్లగా ఒక్కడే స్నానం చేస్తున్నాడు. చివరి నిమిషంలో జోషి చేతులు పైకి ఎత్తడంతో సమీపంలోని వారు గుర్తించారు. అప్పటికే గల్లంతవ్వడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు.
వీఆర్వో కోటప్రోలు ప్రకాశ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుడివాడ అగ్నిమాపక సిబ్బంది, విజ యవాడ నుంచి ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బలగాలు వచ్చి తాత్కాలిక గాలిబోట్లు, లైఫ్ జాకెట్లతో గాలింపు చేపట్టగ జోషి మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు….. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.