ఏపీలో అత్యంత కీలక పరిణామం
ఎన్నికల ముంగిట ఏకంగా డీజీపీపై బదిలీ వేటు
వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఈసీ ఆదేశాలు
రేపు ఉదయం 11 గంటల్లోపు ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలన్న ఈసీ
ఏపీలో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, నేడు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ… ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితాను రేపు ఉదయం 11 గంటల లోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!