నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిన్న కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. మృతులు ముసేటి విష్ణువర్ధన్ (9), మనుబోటి నవశ్రావణ్(12)గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన 9 ఏళ్ల ముసేటి విష్ణువర్ధన్, 12 ఏళ్ల మనుబోటి నవ శ్రావణ్లు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారులు మృతి:
పోలీసులు ఈ రోజు ఉదయం నుంచీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలు, పోలీసు జాగిలాల సహాయంతో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని ఒక చెరువు కుంటలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధించారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది.
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారుల మృతికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో ఉయ్యాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటనపై కలువాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!