అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్య మధ్యాహ్నాం మరణించింది.
అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అందులో నర్సుగా పనిచేస్తున్న దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్యశ్రీ మధ్యాహ్నాం మరణించింది. దివ్యశ్రీ మరణంపై హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు. తమ కూతురిని చంపేశారంటూ దివ్యశ్రీ ఆసుపత్రి ముందు ఆమె తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు.
న్యాయం చేయాలని డిమాండ్
కాళ్లు పట్టుకున్నా కూడా ఎవరూ సమాధానం చెప్పడం లేదని దివ్యశ్రీ తల్లి వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము కూడా ఆత్మహత్యకు పాల్పడుతామని బాధతో తెలిపారు. ఐదేళ్లుగా సవేరా హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తు్ంది దివ్యశ్రీ. గతంలో ఇదే హాస్పిటల్లో అనుమానాస్పదంగా ఓ నర్స్ మరణించింది. ఒకే ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తున్న ఇద్దరు చనిపోవడం స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు