ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి పట్టణం: ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకొని గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు కాగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి రూ.10లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు.
ఈ క్రమంలో మార్చి 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం సాయి తేజ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మంథనికి తీసుకొచ్చారు. ఈ ఘటనపె కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!