గోదావరి ఒడ్డున గట్టుపై ఓ శివాలయం ఉంది. ఇక దాని పై అంతస్తులో ఓ కళ్యాణమండపం ఉంది. ఆ రాత్రి శివాలయం గోడ పక్కన మెరుస్తూ ఓ ఆకారం కనిపించింది.. ఏంటని చూడగా..
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది. గోదావరి ఒడ్డున ఉన్న గట్టుపై ఉన్న సుబ్రహ్మణ్య స్నానాల ఘాట్లో శివాలయం పై అంతస్తులో ఓ కళ్యాణమండపం, వేదిక ఉన్నాయి. బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా గోడ ప్రక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు. తీరా చూస్తే సుమారు 7 అడుగులు ఉన్న ఓ కొండచిలువ అటూ.. ఇటూ.. తిరుగుతోంది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న అందరూ పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన వచ్చారు.
ఓ పక్క పెళ్లి భాజాలు,అందరూ గుమిగూడటంతో ఆ కొండచిలువ కాసేపు ఎటూ కదలకుండా ఉండిపోయింది. ఇటీవల వచ్చిన వరదలకు గోదావరి నుండి ఈ కొండచిలువ కొట్టుకు వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో అక్కడున్న ఆలయ సిబ్బంది అటవీ శాఖకు, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ కొండచిలువను తీసుకెళ్లారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025