SGSTV NEWS
Andhra PradeshCrime

Kurnool: భర్తను వదిలి ప్రియుడి దగ్గరకొచ్చింది.. కట్ చేస్తే.. అతడు ఏం చేశాడంటే.?



నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి.. ప్రేమించిన ప్రియురాలు నా జీవితాన్ని అంతం చేస్తుంది అనుకోలేదు. ప్రేమించిన ప్రియురాలికి పెళ్లి అయినా తానే కావాలంటూ.. భర్త, పిల్లలను వదిలేసి నా వెంట వచ్చి నిత్యం పెళ్లి చేసుకోవాలని వేదిస్తూ ఉంది. నువ్వు నా దగ్గర ఉండకపోతే చనిపోతా అంటూ ఆత్మహత్యాయత్నం చేస్తూ బెదిరిస్తుంది.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డిలో దారుణం చోటు చేసుకుంది. వివాహానికి ముందే ధనుంజయ గౌడ్(27) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన కంటే పెద్ద అయిన శశికళతో ప్రేమలో పడ్డాడు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ వేరేవారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా వారి మధ్య వివాహేతర బంధం కొనసాగడం, ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెళ్లిపోవడంతో ధనుంజయ గౌడ్ భార్య.. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడుతో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరుకు వచ్చేసింది.


ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ గౌడ్ ప్రియురాలిని ఓ లేడీస్ హాస్టల్‌లో చేర్చి తమ బంధాన్ని కొనసాగించాడు. అయితే హాస్టల్‌లో ఉండలేక పోతున్నానని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రియురాలు నిత్యం ఒత్తిడి పెంచింది. ప్రియుడు కాలయాపన చేస్తుండటంతో ఆదివారం ప్రియురాలు తాను ఉంటున్న హాస్టల్‌లో మెడకు ఉరిని బిగించుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ ఫోటోను ధనుంజయ గౌడ్‌కు పంపింది. ఆమె చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డ ధనుంజయ గౌడ్ గ్రామంలోని పొలంలోకి వెళ్లి పురుగులు మందు తాగాడు.



పొలం పక్కన ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. అయితే చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ రాత్రి మృతి చెందాడు. శశికల నిత్యం వేధింపులు చేస్తుండడంతోనే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts