SGSTV NEWS
Andhra PradeshCrime

తిరుపతి: డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..!



టెంపుల్ సిటీ తిరుపతిలో ఒక ఫ్యామిలీ కిడ్నాప్ కలకలం లేపింది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కథకు కారణమని తేలిపోయింది. అలిపిరి పీఎస్ పరిధిలోని జీవకోనలో ఈ ఘటన జరిగింది. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ ముఠా వ్యవహారం వెలుగు చూసింది.

తిరుపతి జీవకోనలో విజయలక్ష్మి కుటుంబం కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. రూ. 2 కోట్లు మేర డబ్బును డిమాండ్ చేసిన ముఠా ఏకంగా ఒక ఫ్యామిలీని మొత్తాన్ని కిడ్నాప్ చేసింది. బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జీవకోనలో ఉంటున్న విజయలక్ష్మి, ఆమె కొడుకు రాజేష్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లల కిడ్నాప్ పక్కా ప్లాన్‌తో జరిగింది. జీవకోనలో రాజేష్ మీసేవ నిర్వహిస్తుండగా.. అతని స్నేహితుడు భార్గవ్, భార్గవ్ స్నేహితుడు అరుణ్ కుమార్ కలిసి చేసిన కిడ్నావ్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అప్పు అడిగినందుకే కిడ్నాప్..
చిన్ననాటి స్నేహితులైన రాజేష్, భార్గవ్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కిడ్నాప్ వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టారు. విజయలక్ష్మి, ఆమె కొడుకు రాజేష్ కుటుంబం మొత్తాన్ని అపహరించిన భార్గవ్, అరుణ్ గ్యాంగ్ రూ. 2 కోట్లు డిమాండ్ చేసింది. రాజేష్ వద్ద దాదాపు రూ. 24 లక్షలు దాకా అప్పుగా తీసుకున్న భార్గవ్ తిరిగి చెల్లించేందుకు ఇబ్బంది పెట్టడంతో రాజేష్ తల్లి విజయలక్ష్మి నిలదీసింది. ఈ మధ్యకాలంలో ఒత్తిడి తెచ్చింది. దీంతో భార్గవ్ అతని స్నేహితుడు అరుణ్ కుమార్‌తో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేశాడు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తల్లి కొడుకు విజయలక్ష్మి, రాజేష్‌లకు ఒక అపార్ట్మెంట్ అమ్మి అప్పు చెల్లిస్తామని నమ్మించారు. ఈ మేరకు పథకం ప్రకారం విజయలక్ష్మి, రాజేష్‌తో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా అపార్ట్మెంట్‌కు తీసుకెళ్లి అక్కడే బంధించిన భార్గవ్, అరుణ్ గ్యాంగ్ రాజేష్ భార్యను కూడా అక్కడికి రప్పించగలిగారు.

కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో..
నిన్న రాత్రంతా అపార్ట్మెంట్‌లోనే బంధించి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఇక ఎలాగైనా కిడ్నాప్ చేసిన ముఠా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా రాజేష్ చిత్తూరులో తెలిసిన వారి దగ్గర డబ్బు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో ఈ రోజు ఉదయం రెండు కార్లలో రాజేష్ కుటుంబాన్ని తీసుకెళ్లిన కిడ్నాపర్ల చెర నుంచి మార్గం మధ్యలో తప్పించుకున్న రాజేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డ బాధితుడు రాజేష్‌ను రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


చెంప చెల్లు మనిపించడంతోనే..
దాదాపు రూ 24 లక్షల మేర అప్పు తీసుకున్న భార్గవ్.. రాజేష్ క్రెడిట్ కార్డులను కూడా వినియోగించాడు. గత ఫిబ్రవరి నెలలో రాజేష్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటి వద్దకు వచ్చి నిలదీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భార్గవ్‌ను ఉద్దేశించి రాజేష్, అతని తల్లి విజయలక్ష్మి మాట్లాడిన మాటలకు హార్ట్ అయ్యాడు. ఈ కోవలోనే విజయలక్ష్మి భార్గవ్ చెంపపై చెల్లుమనిపించింది. దీంతో కక్ష పెంచుకున్న భార్గవ్ తన స్నేహితుడు అరుణ్ కుమార్‌ను.. రాజేష్‌ను పరిచయం చేసి బిజినెస్ డీల్ ఉందని నమ్మించారు. ఈ నేపథ్యంలో నిన్న కరకం బాడి రోడ్డులోని ఒక అపార్టమెంట్ వద్దకు తల్లితో రమ్మని రాజేష్‌కు చెప్పి ప్లాన్ అమలు చేశారు. తన కారును రాజేష్‌కు ఇచ్చిన భార్గవ్ కిడ్నాప్ కథకు తెర తీశాడు. రాజేష్ తల్లి విజయలక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలను భార్గవ్ కారులోనే తీసుకెళ్లిన రాజేష్ అపార్టమెంట్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే ముందస్తు ప్లాన్‌తో ఉన్న భార్గవ్.. రాజేష్‌ను ఒక గదిలో తల్లి విజయలక్ష్మి పిల్లలను మరో గదిలో బంధించారు. రూ. రెండు కోట్లు డబ్బు ఇస్తే విడిచి పెడతామని బెదిరించారు. దాడి కూడా చేసిన భార్గవ్ గ్యాంగ్ ఆరు నెలల జాష్మిత ఏడుస్తుందని రాజేష్ చేతనే భార్య సుమతికి ఫోన్ చేసి అపార్ట్మెంట్ వద్దకు పిలిపించారు. ఇలా మొత్తం ఫ్యామిలీని ఒక చోటకు చేర్చిన కిడ్నాపర్లు చిత్తూరుకు తీసుకెళతుండగా.. ఐతేపల్లి వద్ద రాజేష్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరగ్గా రాజేష్ తలపై ఇనుపరాడ్‌తో కిడ్నాపర్లు కొట్టినా.. తప్పించుకుని జనాల మధ్యకు రావడంతో కిడ్నాపర్ అరుణ్ కుమార్ కారులో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్న రాజేష్ భార్య సుమతి ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సీసీ ఫుటేజ్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

Also read

Related posts

Share this