October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshTrending

Watch: ఈ రైతన్న కష్టం మరెవరికీ రాకూడదయ్య.. రాత్రి డబ్బును బీరువాలో పెట్టాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్..

పండించిన పంటను అమ్మాడు.. మొత్తం రూ.500 నోట్లే.. డబ్బుకట్టను ఇంటికి తెచ్చాడు.. ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టాడు.. తెల్లారే వాటిలోంచి తీసి.. అవసరాల కోసం ఉపయోగిద్దామనుకున్నాడు.. కట్ చేస్తే.. ఎలుకలు అతని కలలను కల్లలుగా చేశాయి.. మొత్తం నోట్లను కొరికేశాయి.. ఈ విచిత్రమైన పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ రైతుకి ఎదురైంది. కష్టపడి పండించిన పంటను అమ్ముకుంటే ఆ సొమ్ము మొత్తం ఎలుకలపాలైంది. నిన్న రాత్రి ఐదు వందల రూపాయల నోట్ల కట్టను బీరువాలో పెడితే… తెల్లారిసరికే ముక్కలు ముక్కలు చేసేశాయ్‌ ఎలుకలు. ఉదయం బీరువా తెరిచిన రైతు… ముక్కలైన నోట్లను చూసుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన జి.మాడుగల మండలం రాపల్లి గ్రామంలో జరిగింది..


పసుపును పండించే రైతు బుఠారీ రామారావు… ఎప్పటిలాగే సంతలో పంటను అమ్ముకున్నాడు. మొత్తం పది వేల రూపాయలు వచ్చాయి. అన్నీ ఐదు వందల రూపాయల నోట్లే. ఆ డబ్బును తీసుకొచ్చి బీరువాలో దాచుకున్నాడు రామారావు. ఇవాళ లేచి చూసుకునేసరికి నోట్లు మొత్తం ముక్కలుముక్కలై కనిపించాయ్‌. ఆ సీన్‌ను చూసిన రైతు రామారావు షాక్‌కి గురయ్యాడు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎలుకలపాలైందంటూ ఆవేదన చెందుతున్నాడు.

వీడియో..

Also read :

Related posts

Share via