July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?

జూన్ నెల 28వ తేదీన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోట గ్రామ సమీపంలో కొండ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ విలువలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఒక కాలేజీ విద్యార్థి అని తెలిసి పోలీసులే నివ్వెరపోయారు.

Also read :అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..

చదువుకోవాల్సిన యువకుడు హత్య చేస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. చివరికి ఎవరి మీద అయితే అనుమానం రాలేదో, అతడే హంతకుడిగా తేల్చారు పోలీసులు. మొత్తం మీద హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తతో వివాహేతర సంబంధం వద్దని వారించిన మేనమామనే. మేనల్లుడు హత్య చేశాడు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోట గ్రామంలో నివాసముంటున్న వన్నూరు స్వామి (30) గత నెల 28న దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read :ఎక్కడినుంచి వస్తార్రా మీరంతా.. నల్లకోడి, గుమ్మడికాయ, ఎర్రని బొమ్మలు.. మధ్యలో ఆహ్వాన పత్రిక..

కళ్యాణదుర్గంలోని ఓ హోటల్లో కార్మికుడిగా పని చేస్తూ వన్నూరు స్వామి జీవనం సాగిస్తున్నాడు. వన్నూరుస్వామి భార్య వాణి సమీప బంధువైన గుత్తి మండలం కొజ్జేపల్లికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు మేనమామ వన్నూరుస్వామి ఇంట్లోనే ఉంటున్నాడు. అలా కొద్ది రోజులకు జయవర్ధన్ మేనమామ భార్య వాణితో చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ చనువు కాస్తా, అత్త, అల్లుడు మధ్య నైతిక సంబంధం పెట్టుకునే వరకు వెళ్ళింది. అలా అత్త, అల్లుడు ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెరిగింది. కొద్ది రోజులకే అత్త అల్లుడి బాగోతం తెలుసుకున్న మేనమామ వన్నూరుస్వామి అనేకసార్లు యువకుడిని మందలించాడు. అత్తతో వివాహేతర సంబంధం మంచిది కాదని హెచ్చరించాడు.

Also read :ED: పేద విద్యార్థులకు సేవ పేరుతో దోపిడీ.. కేసు నమోదు చేసిన ఈడీ

దీంతో ఎలాగైనా మామ అడ్డు తొలగించుకోవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. మేనమామ వన్నూరు స్వామి అడ్డు తొలగించుకుంటే అత్తతో శాశ్వతంగా ఉండిపోవచ్చని నిశ్చయించుకున్న యువకుడు పథకం ప్రకారం మేనమామ వన్నూరు స్వామిని హత్య చేశాడు. ప్లాన్ లో భాగంగా జూన్ 28వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు గ్రామ సమీపంలోని కొండ దగ్గరకు రప్పించాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మరోసారి ఇద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో మేనల్లుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో మామ వన్నూరుస్వామి గొంతులో పొడిచి, గొంతుపై భాగాన్ని కత్తితో కోసి హతమార్చాడు. మేనమామను హత్య చేసిన అనంతరం నిందితుడు పరారయ్యాడు. మృతుడు వన్నూరు స్వామి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read :చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

వన్నూరుస్వామి హత్య కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వన్నూరు స్వామి హత్య జరిగే వరకు ఇంట్లోనే ఉన్న మేనల్లుడు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మేనల్లుడు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కళ్యాణదుర్గంలోని కొండ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఆ యువకుడు కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు రంకు బయటపడింది. అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే మేనమామను హత్య చేసినట్లు యువకుడు అంగీకరించాడు. దీంతో నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also read :భర్తను వదిలేసి.. రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉద్యోగం.. టెర్రస్ పైకి వెళ్లి……

Related posts

Share via