SGSTV NEWS online
CrimeTelangana

స్కానింగ్ సెంటర్‌ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ బాలిక.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!


నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లిలో ఇంటర్మీడియట్ విద్యార్థిని స్కానింగ్ సెంటర్‌లోని వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక కళాశాలలో పరీక్షకు హాజరవుతుండగా తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. ఇన్విజిలేటర్ తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, వారు కళాశాలకు చేరుకుని ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి.. స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు.

స్కానింగ్ సెంటర్ సిబ్బంది ప్రక్రియ ప్రారంభించబోతుండగా, వాష్‌రూమ్‌కి వెళ్లి బిడ్డను ప్రసవించింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. శిశువు, బిడ్డ ఇద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తన అమ్మమ్మ ఊరికి చెందిన తన వయసు వ్యక్తితోనే సంబంధం పెట్టుకుందని తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు రాసేప్పుడు ఇద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత కేజీబీవీలో బాలిక చేరింది. ఈ క్రమంలో సెలవు రోజుల్లో బాలిక తన అమ్మమ్మ ఊరికి వెళ్తుండేది. ఈ సమయంలోనే బాలుడి తల్లిదండ్రులు లేనప్పుడు ఇద్దరూ కలిసేవారు.

ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చినట్టుగా ప్రచారం అవుతోంది. అయితే కేజీబీవీ అసలు విషయం బయట పడకుండా.. బాలిక వదులుగా ఉండే దుస్తులు వేసుకునేదని తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో తాను ఆరోగ్యంగా ఉన్నట్టుగా చెప్పుకొనేది. అవసరం లేదని తెలిపేది.

ఇటీవలే సేమ్ ఘటన
కొన్ని రోజుల కిందట ఇంటర్ పరీక్షా కేంద్రంలోని బాత్ రూమ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థిని మృత శిశువుకు జన్మనిచ్చింది. పాల్వంచలోని ఓ కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లీష్(ఫిబ్రవరి 27) పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్‌లెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవటంతో టాయిలెట్ వైపు వెళ్లి చూశారు.

సదరు విద్యార్థిని నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. ఆమె తీరును గమనించిన సిబ్బంది ఆమెను ప్రశ్నించారు. బాలిక పలు వివరాలు చెప్పటంతో.. అసలు విషయం బయటపడింది. టాయిలెట్ లోకి వెళ్లిచూడగా.. బేసిన్‌లో చనిపోయిన శిశువు పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూం బేసిన్‌లో కుక్కినట్లు బాలిక తెలిపినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ద్వారా తెలియజేశారు. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

Also read

Related posts