October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఆస్తి తగదాల నేపథ్యంలో ఓ ఇంటిని పట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు

పెనమలూరు నియోజకవర్గం
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు దళితవాడలో విధ్వంసం ఆస్తి
ఆస్తి తగదాల నేపథ్యంలో ఓ ఇంటిని పట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు

ఆకునూరు లో ఆస్తి గొడవ వల్ల ఇంటికి అదే ఆస్తిపై కోర్టులో నడుస్తున్న కేసులు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటనకు పాల్పడిన బొంతు సునీల్

తప్పిన ప్రాణ నష్టం

మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైన ఇల్లు వస్తువులు

కట్టుబట్టలతో రోడ్డుపై నిలచిన తల్లి కూతుళ్లు

ఘటనను గమనించిన స్థానికులు

యువకున్ని వెంబడించి పోలీసులకు అప్పగించిన స్థానికులు

బాధితురాలు బొంతు ప్రమీల ఫిర్యాదుతో ఉయ్యూరు రూరల్ స్టేషన్లో కేసు నమోదు

న్యాయం చేయాలంటూ బాధితుల రోదన

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం హుజూర్ మండలం ఆకునూరు అంబేద్కర్ నగర్ లో మండలంలోని కడవకల్లు గ్రామానికి చెందిన ఓ మహిళ ఉయ్యూరు రూరల్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఆమె కుమారుడు బొంతు సునీల్ దళితవాడకు చెందిన బొంతు ప్రమీల ఇంటిపై పెట్రోల్ పోసి పట్టపగలు నిప్పంటించి పారిపోయాడు ఉయ్యూరు రూరల్ పోలీసులకు అప్పగించారు ఘటన జరిగిన సమయంలో ఏ ఒక్కరో ఇంట్లో లేకపోవడం విశేషం దీంతో ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు బొంతు ప్రమీల ఫిర్యాదు చేయడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు కాగా స్థానిక నుంచి సమాచారం అందుకున్న ఉయ్యూరు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు బాధితురాలు బొంతు ప్రమీల మీడియాతో మాట్లాడుతూ ఆస్తి తగాదాల నేపథ్యంలో కోర్టులో కేసు నడుస్తుండగా బొంతు సునీల్ భయభ్రాంతులకు గురి చేసేందుకు తమను పలుమార్లు ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

వీడియో..

Also read :ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తివేత

ఇంటర్ విద్యార్థినిపై రౌడీషీటర్ దారుణం.. ఆటోలో బలవంతంగా ఎక్కించి

బ్యాంకు ఉద్యోగిని దారుణ నిర్ణయం.. 6 నెలలుగా వాళ్లు వేధిస్తున్నారని..!

స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతుండగానే.. దారుణం.. పాపం ఆమె పరిస్థితి

Related posts

Share via