సికింద్రాబాద్లో స్త్రీ వేషధారణలో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు పురుషులతో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్ నిర్వాహకులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్లో స్త్రీ వేషధారణలో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు పురుషులతో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్ నిర్వాహకులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. మాయాబజార్ హోటల్ సమీపంలో భిక్షాటన పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సూరద చాందిని, జయశ్రీ, మనీషాలు లింగమార్పిడి చేసుకొని ట్రాన్స్ జెండర్లుగా మారినట్లు పోలీసులు తెలిపారు. వీరు నలుగురు పురుషులకు స్త్రీ వేషధారణ వేయించి వ్యాపార సముదాయాలు, సిగ్నల్స్ వద్ద డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వారిపట్ల వాహనదారులు వ్యాపారస్థులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Also read
- టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Telangana: ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి.. ఎందుకో తెలిస్తే..





