పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.
AP CRIME: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మద్యం తాగిన సమయంలో పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు స్నేహితులు ఘర్షణ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావటంతో వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.
పాత గొడవల నేపథ్యంలో..
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి.. చుట్టు పక్కల వారిని ప్రమాద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులు వెంకటనారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు
Also Read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..