మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండటంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అరెస్టుకు భయపడిన పిన్నెల్లి సోదరులు గతంలో పోలీసులు కళ్లు గప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





