మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండటంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అరెస్టుకు భయపడిన పిన్నెల్లి సోదరులు గతంలో పోలీసులు కళ్లు గప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు.
Also read
- పెళ్లి రిసెప్షన్కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?
- TTD fake Darshan Ticket Gang: శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
- కరిగించి అమ్మితే కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ నెల్లూరు పోలీసులు ‘ముద్ద’ తినిపించారు!
- ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!
- తోటి పోలీస్పైనే కేసు పెట్టిన పోలీస్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే.. ఎందుకో తెలుసా?





