పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది.

అబ్దుల్లాపూర్మెట్: పాల ప్యాకెట్ కోసం కుమారుడితో
వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు. జీవనోపాధి కోసం పది రోజుల క్రితమే ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చింది. గురువారం ఉదయం కనక ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై అతడి బైకు విజయవాడ వైపు నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ప్రసాద్ మృతిచెందారు. బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో