పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది.

అబ్దుల్లాపూర్మెట్: పాల ప్యాకెట్ కోసం కుమారుడితో
వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు. జీవనోపాధి కోసం పది రోజుల క్రితమే ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చింది. గురువారం ఉదయం కనక ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై అతడి బైకు విజయవాడ వైపు నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ప్రసాద్ మృతిచెందారు. బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Also read
- ఖరీదైన రత్నాలు అవసరం లేదు.. ఈ ఒక్క పరిహారంతో జాతక దోషాలకు చెక్!
- కష్టాలు వెంటాడుతున్నాయా? 3 సోమవారాలు ఈ శివ పరిహారం చేస్తే జీవితమే మారిపోతుందట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పోలీసు స్టేషన్ లో రెండు వర్గాల ఘర్షణ
- నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తీసుకురా..!





