SGSTV NEWS
Andhra PradeshCrime

విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన గంజాయి బ్యాచ్‌



విజయవాడ: నగరంలో మరోసారి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. విధి నిర్వహణలో ఉన్న విజయవాడ గవర్నర్‌పేట డిపో-1కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సీహెచ్‌ ఎస్‌ రావుపై అల్లరి మూకలు దాడి చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరంగల్‌ నుంచి కార్గో వాహనం నడుపుతూ విజయవాడ వస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూడలి దాటాక దాడి జరిగింది. ఆర్టీసీ కార్గో వాహనాన్ని వెంబడించి, కారు అడ్డంపెట్టి డ్రైవర్‌పై రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడి చేశారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దాడిలో డ్రైవర్‌ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని తొలుత విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద గంజాయి బ్యాచ్‌ ఇటీవలే పలువురిపై దాడికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.

Also read

Related posts

Share this