అమరావతి: విశాఖపట్నంలోని ఎన్ఎడి జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులని పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పోలీసులకు యువకుడికి మద్య మాటామాటా పెరింగింది. దీంతో ఆ పోలీసు చొక్కాను యువకుడు పట్టుకున్నాడు. తన కాలర్ పట్టుకోవడంతో ఆగ్రహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువకుడిని కొట్టాడు. దీనితో రెచ్చిపోయిన యువకుడు తిరిగి ట్రాఫిక్ కానిస్టేబుల్ను కొట్టాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కానిస్టేబుల్పై చేయి చేసుకున్నందుకు యువకుడిపై కేసు నమోదు చేశారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





