ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణoలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకరన్ గురుకుల్ వారిని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు,
ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.ఇ.ఓ ఏకాంబరం,టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- 100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!
- పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం, వివాహ యోగం ఖాయం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Andhra: హీరోగా సగం సినిమా కూడా కంప్లీట్.. ఆ ఒక్క ఘటనతో చివరకు ఇలా..
- New Scam: ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు.. జాగ్రత్త..!





