ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్. లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది
బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
చౌటుప్పల్ : ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్కు చెందిన భార్యాభర్తలు ఐదారు నెలల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. ఇద్దరూ వేర్వేరు పరిశ్రమల్లో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి వివాహిత (20) తన నివాసం వద్ద ఒంటరిగా ఉండటాన్ని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు (22) గమనించాడు. అదే అదనుగా ఆమెను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు 100 నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పగా వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొన్నారు. నిందితుడి గురించి ఆమెను ప్రశ్నించగా.. నేరుగా అతని ఇంటికి తీసుకెళ్లి చూపించారు. ఆ సమయంలో యువకుడు ఇంట్లోనే ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా నిందితుడు కొంత కాలంగా గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనూ గంజాయి మత్తులోనే ఉన్నాడని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
Also read
- ‘ఎందుకు చంపావ్ నాన్నా..’ ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
- మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన పసి ప్రాణం!
- దొంగలు బాబోయ్ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్ దొంగలు…
- బాలింత చితాభస్మంలో కత్తెర.. అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు
- రాడ్డుతో తలపై కొట్టి.. చెరువులో పడేసి..





