నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో జరిగింది
చిన్నాపూర్ (మోపాల్) : నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. ఎస్ చ్వో గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం పొతంగల్ గ్రామానికి చెందిన గంగాధర్, స్వరూపలకు ఇద్దరు కుమార్తెలు. స్వరూప.. భర్త, పిల్లలతో కలిసి బుధవారం మోపాల్ మండలం చిన్నాపూర్లోని సోదరి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం స్నేహితను ఆడిస్తూ ఉండమని మూడేళ్ల పెద్ద కుమార్తెకు చెప్పి స్వరూప స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నిండుగా నీళ్లు ఉన్న బకెట్లో స్నేహిత తలకిందులుగా కనిపించింది. ఆమెను బయటకు తీసి పెద్దగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు చిన్నారి తాగిన నీళ్లను బయటకితీసే ప్రయత్నం చేసేలోపే చనిపోయింది.
Also read
- దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
- నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..





