హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోట్ల కట్టల కలకలం రేగింది. భారీ మొత్తంలో డబ్బు సీజ్ అయ్యింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాదాపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది. కారులో 2కోట్ల 20లక్షల రూపాయల నగదు గుర్తించారు. జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ వైపు వెళ్తున్న కారులో డబ్బు ఉంది. సరైన ధ్రువపత్రాలు లేకుండా కారులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో డబ్బును సీజ్ చేశారు పోలీసులు. అలాగే కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాదాపూర్ పోలీసులు.
ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం కలకలం రేపింది. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. సరైన పత్రాలు లేకపోతే డబ్బును పోలీసులు సీజ్ చేస్తారు. కేసు నమోదు చేస్తారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. రహదారులు, హైవేలపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఎన్నికల అధికారులతో కలిసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





