భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జవహర్నగర్(పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఇందిర(39) భర్త పెద్దబ్బాయి, ఇద్దరు పిల్లలతో కలిసి జవహర్నగర్ సంతోష్ నగర్లో నివసిస్తున్నారు. ఆమె నాటుకోడి చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా.. పెద్దబ్బాయి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దంపతుల మధ్య తగాదాలతో పెద్దబ్బాయి మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరడంతో మూడు నెలల నుంచి కలిసి ఉంటున్నారు. భర్తకు తెలియకుండా ఇందిర నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసింది. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వస్తుండడంతో పెద్దబ్బాయి భార్యను నిలదీశాడు. సోమవారం చికెన్ షాపు(Chicken shop) వద్ద ఉన్నప్పుడు మాటామాటా పెరగడంతో భర్త భార్యపై కత్తితో దాడిచేశారు. చేతికి, తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్లో గాయపడిన ఇందిరను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)