రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యా ఇద్దరు పిల్లలపై దారుణంగా దాడి చేయడంతో భార్య, కుమారుడు మృతి చెందాడు. కూతురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.. ఈ దారుణ సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆమనగల్లు మండలం సీతారాంనగర్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో ఈ దారుణం వెలుగు చూసింది. రోజు మాదిరిగానే బాణావత్ రాందాస్ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం (మార్చి 31) రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం తాగొద్దని భార్య వాదించింది. దీంతో క్షణికావేశంలో భార్య కవిత, కుమారుడు హర్ష, కూతురు ప్రణీతలపై బాణావత్ రాందాస్ దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టడంతో భార్య కవిత, కుమారుడు హర్ష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కూతురు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!
- ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్
- దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!
- అద్దె గదిలో CA విద్యార్థి అనుమానాస్పద మృతి.. సూసైడా? మర్డరా..?
- తాండూరులో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పోక్సో కేసు నమోదు!





