SGSTV NEWS online
AstrologyUgadi Rasi Phalalu

ఉగాది పంచాంగ శ్రవణం.. శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు!



ఉగాది పండుగ వచ్చేస్తోంది. మార్చి19 గురువారం రోజున ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్లి పూజలు జరిపించుకొని, పంచగా శ్రవణం వింటారు. ముఖ్యంగా తమ పేరు మీద ఎలా ఉంది? ఆదాయ వ్యయాలు తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు మనం వృశ్చిక రాశివారికి పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుందో లేదో చూద్దాం.

వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు చూస్తే, విశాఖ 4వ పాదం, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు, ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ పూజ్యం 2, అవమానం 6. ఈ రాశివారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. చాలా ఉత్సాహంగా పని చేస్తారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.

వృశ్చిక రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంది. ఆకస్మిక ధన లాభం కలిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరికి గురు బలం ఉండటంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి.

వ్యాపారస్తులకు ఈ పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చాలా వరకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఆర్థికంగా బాగుంటుంది. ద్వితీయార్థంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి.

ఉగాది ముందు రోజు పూజ చేసి హారతి ఇచ్చి ఇంటి ముందు అగరబత్తీలను వెలిగించండి. అలాగే, ఇల్లు మొత్తం సాంబ్రాన్ పొగ వేయండి. ఇలా చేస్తే ఇళ్లు మొత్తం పాజిటివ్ గా మారుతుంది.

వృశ్చిక రాశి స్త్రీలకు చాలా బాగుంది. వీరు తమ మాట తీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపుచేస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎందుకంటే, గుండె, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Related posts