నెల్లూరు : నెల్లూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి సుధీప్ (15) ఉరేసుకుని బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. స్కూలు టీచర్ బ్యాగ్ నుంచి డబ్బులు తీశారన్న కారణంతో అందరి ముందు విద్యార్థిని కొట్టడంతో మానసిక ఒత్తిడికి గురై తన ఇంటిలోనే ఉరేసుకుని చనిపోయారు. తమ పిల్లవాడు డబ్బులు తీయలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ స్కూలు ఎదుట సుధీప్ భౌతికకాయంతో మృతుని తల్లిదండ్రులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థిపై దాడి చేసి నిందలు మోపడం వల్ల మానసిక ఒత్తిడికి గురై మరణించారని పేర్కొన్నారు. పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




