నెల్లూరు : నెల్లూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి సుధీప్ (15) ఉరేసుకుని బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. స్కూలు టీచర్ బ్యాగ్ నుంచి డబ్బులు తీశారన్న కారణంతో అందరి ముందు విద్యార్థిని కొట్టడంతో మానసిక ఒత్తిడికి గురై తన ఇంటిలోనే ఉరేసుకుని చనిపోయారు. తమ పిల్లవాడు డబ్బులు తీయలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ స్కూలు ఎదుట సుధీప్ భౌతికకాయంతో మృతుని తల్లిదండ్రులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థిపై దాడి చేసి నిందలు మోపడం వల్ల మానసిక ఒత్తిడికి గురై మరణించారని పేర్కొన్నారు. పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also read
- Astrology: శని అమావాస్యలో శక్తివంతమైన రాజయోగం! 5 రాశులకు డబుల్ జాక్పాట్ అదృష్టం.. వరదలా డబ్బు!
- తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు
- లేడీస్ హాస్టల్ భవనంపై మృతదేహం.. గుంటూరుజిల్లాకు చెందిన మహిళగా గుర్తింపు
- ప్రేమజంట పెళ్లి వ్యవహారం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
- బంగారం కోసం చేతులు, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణహత్య





