SGSTV NEWS online
Andhra PradeshCrime

శ్రీచైతన్య పాఠశాల విద్యార్థి ఆత్మహత్య



నెల్లూరు : నెల్లూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి సుధీప్‌ (15) ఉరేసుకుని బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. స్కూలు టీచర్‌ బ్యాగ్‌ నుంచి డబ్బులు తీశారన్న కారణంతో అందరి ముందు విద్యార్థిని కొట్టడంతో మానసిక ఒత్తిడికి గురై తన ఇంటిలోనే ఉరేసుకుని చనిపోయారు. తమ పిల్లవాడు డబ్బులు తీయలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ స్కూలు ఎదుట సుధీప్‌ భౌతికకాయంతో మృతుని తల్లిదండ్రులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర డిమాండ్‌ చేశారు. విద్యార్థిపై దాడి చేసి నిందలు మోపడం వల్ల మానసిక ఒత్తిడికి గురై మరణించారని పేర్కొన్నారు. పాఠశాలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Also read

Related posts