వీడియో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
హైదరాబాద్ : నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి, గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు.
Also read
- రాగి పాత్రలు శని పూజలో ఎందుకు నిషిద్ధం? సూర్య-శని సంబంధం షాకింగ్ నిజం!
- Astrology: శని అమావాస్యలో శక్తివంతమైన రాజయోగం! 5 రాశులకు డబుల్ జాక్పాట్ అదృష్టం.. వరదలా డబ్బు!
- తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు
- లేడీస్ హాస్టల్ భవనంపై మృతదేహం.. గుంటూరుజిల్లాకు చెందిన మహిళగా గుర్తింపు
- ప్రేమజంట పెళ్లి వ్యవహారం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ





