వీడియో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
హైదరాబాద్ : నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి, గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





