వివాహేతర సంబంధాలు అనేక అనర్ధాలకు దారి తీస్తున్నాయి. అనైతిక సంబంధాల కోసం ఎంత వరకైనా తెగబడుతున్నారు. అభం శుభం తెలియని వ్యక్తులు బలి అవుతున్నారు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని సొంతం చేసుకునేందుకు ఓ మహిళ ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లికి నగేష్ యాదవ్ కు మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నగేష్ కు ఇదే గ్రామానికి చెందిన సుజాత అనే మహిళతో పెళ్లికి ముందు నుండి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. సుజాతతో ఉన్న వివాహేతర సంబంధం నగేష్ కుటుంబంలో తెలిసి గొడవలు కూడా అయ్యాయి. ఇద్దరిని బంధువులు, గ్రామ పెద్దలు హెచ్చరించారు. దీంతో నగేష్, సుజాతల మధ్య దూరం పెరిగింది. దీంతో నగేష్ను దక్కించుకోవాలన్న అక్కసుతో మమత అడ్డు తొలగించుకోవాలని పెద్ద స్కెచ్ వేసింది.
ప్రియుడిని దక్కించుకునేందుకు నగేష్ భార్యను అంతమొందించాలని సుజాత పథకం వేసింది. ఇందులో భాగంగా శనివారం (జనవరి 31) తన ఇంటి నుండి ఓ సంచిలో పెట్రోల్ బాటిల్, కత్తి, కారం పొడి తీసుకుని నగేష్ ఇంటికి సుతాత వెళ్ళింది. ఆ సమయంలో ఇంటిముందు కూర్చొని తన ఆరు నెలల బాబుకు నగేష్ భార్య మమత పాలిస్తోంది. వెనుక నుండి వెళ్లి మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది సుజాత. ఒక్కసారిగా ఈ ఘటనతో మమత కేకలు వేసింది. తన ఒడిలో ఉన్న కొడుకును దూరంగా విసిరేసింది.
కానీ మంటలు శరీరమంతా తీవ్రంగా వ్యాపించడంతో శరీరం కాలిపోయి అక్కడికక్కడే మమత మృతి చెందింది. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు. మమత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భర్త నగేష్ ప్రమేయం లేకుండా సుజాత.. ఈ దారుణానికి వడిగట్టి ఉండేది కాదని మమత బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మమత మృతికి కారణమైన సుజాతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
- శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!





