చెత్త వెదవలు.. కామాంధులు.. మారీచులు… ఎక్కడ చూడు వీళ్లే. అమ్మాయిలకు అస్సలు రక్షణ లేకుండా పోతుంది. గుడి, బడి, వీధి, వసతి గృహం.. ఇలా ఎక్కడపడితే అక్కడ పైశాచికం ప్రదర్శిస్తున్నారు నీచులు. వికృత చేష్టలతో రెచ్చిపోతూ.. అమ్మాయిలను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు..
ఎక్కడ చూడు కామాంధులే. అమ్మాయిలకి అస్సలు రక్షణ లేదు. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయి వాష్ రూమ్స్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి.. వికృత ఆనందం పొందే.. మారీచులు మరికొందరు. తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హిడెన్ కెమెరా కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూమ్లో  అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి.. వీడియోలు రికార్డు చేస్తున్నాడు.  బాత్రూమ్లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంటపడింది. ఏంటా అని చెక చేయగా.. రహస్య కెమెరా అని గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్కి, తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. బాత్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న యాకూబ్ కోసం.. గాలింపు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
 - అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 





