మహబూబాబాద్ జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నాగులచవితి పర్వదినం రోజున భక్తులకు నాగన్న దర్శనం కనువిందు చేసింది. జిల్లాలోని బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని శివాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అంతేకాదు..శివలింగం పైన పడగవిప్పిన నాగుపాము భక్తుల్ని ఆశీర్వదించినట్టుగా కనిపించింది. నాగులచవితి రోజున గర్భగుడిలో నాగుపాము కనిపించటం అరుదైన ఘట్టంగా భావించిన భక్తులు పరవశించి పోయారు. నాగుపాముకు దండాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమలతో అర్చనలు అభిషేకాలు చేశారు.
Also read
- Tdp Tweet: కోడి కత్తి.. కమల్ హాసన్.. టీడీపీ ర్యాగింగ్!
- కార్తీక దీపం వెలిగిస్తున్నారా? మర్చిపోకుండా ఈ ఒక్క మంత్రం చదవండి
- నేటి జాతకములు…27 అక్టోబర్, 2025
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..





