మహబూబాబాద్ జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నాగులచవితి పర్వదినం రోజున భక్తులకు నాగన్న దర్శనం కనువిందు చేసింది. జిల్లాలోని బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని శివాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అంతేకాదు..శివలింగం పైన పడగవిప్పిన నాగుపాము భక్తుల్ని ఆశీర్వదించినట్టుగా కనిపించింది. నాగులచవితి రోజున గర్భగుడిలో నాగుపాము కనిపించటం అరుదైన ఘట్టంగా భావించిన భక్తులు పరవశించి పోయారు. నాగుపాముకు దండాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమలతో అర్చనలు అభిషేకాలు చేశారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





