తనను పట్టించుకోలేదంటూ కూతురికి రాసిచ్చిన ఆస్తినే రద్దు చేసుకుంది ఓ వృద్ధురాలు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లి మమకారంతో ఇచ్చిన ఆస్తి… చివరికి అదే తిరిగి తల్లి పేరుకే చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి…
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను ఎంతో మమకారంతో కూతురికి ఆస్తి రాసిచ్చింది తల్లి. ఆ తతగం పూర్తయిన కొన్నాళ్ల నుంచి తల్లిని కూతురు పట్టించుకోవడం మానేసింది. దీంతో తల్లి.. తన ఆస్తిని తిరిగి ఇవ్వాలని పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళ్తే.. ధర్మవరంలోని లోనికోటకు చెందిన గుంజర లక్ష్మమ్మ అనే వృద్ధురాలు 2012లో తన కుమార్తె లక్ష్మీదేవి పేరుమీద 59 సెంట్ల స్థలాన్ని దాన విక్రయం ద్వారా రాసిచ్చింది. తల్లి ఇచ్చిన ఆస్తిని తీసుకున్న కూతురు.. ఆపై ఆమె సంరక్షణ బాధ్యతను మరిచింది. 11 ఏళ్లుగా తన సంరక్షణ పట్టించుకోవడం లేదంటూ లక్ష్మమ్మ ఆగ్రహంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో మహేష్ విచారణ జరిపించారు. విచారణలో లక్ష్మమ్మ ఆరోపణలు నిజమని తేలడంతో.. కుమార్తె లక్ష్మీదేవికి రాసిచ్చిన ఆస్తి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 59 సెంట్ల స్థలం తిరిగి తల్లి లక్ష్మమ్మ పేరుకు మార్చారు.సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం.. తల్లిదండ్రులను సంరక్షించని వారికీ బహూకరించిన ఆస్తిని తిరిగి రద్దు చేసుకునే హక్కు ఉంటుందని ఆర్డీవో స్పష్టం చేశారు. తీర్పు ప్రతిని శుక్రవారం లక్ష్మమ్మకు అందజేశారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





