పండుగ పూట ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. దీపావళి పండుగను పురస్కరించుకుని 9 మంది యువకులు.. ఎంజాయ్ చేసేందుకు విశాఖ యారాడ బీచ్ దగ్గరకు వెళ్లారు.. నీళ్ల లోపలికి వద్దు.. అంటూ అక్కడున్న పోలీసులు చెప్పారు.. వినలేదు.. చాలా సార్లు చెప్పారు.. అయినా వారు వినకుండా తప్పించుకుంటూ.. నీటిలోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. ఇంతలోనే.. అలలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.. 9 మందిలో ఇద్దరు కెరటాల్లో కొట్టుకుపోయారు.. ఈ విషాద ఘటన విశాఖ యారాడ బీచ్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం అప్పటినుంచి గాలింపు కొనసాగుతోంది.. ఇప్పటివరకు వారి జాడ లభించలేదని పోలీసులు చెప్పారు.
యారడ బీచ్ దగ్గరకు వెళ్లారు 9 మంది యువకులు వచ్చారని.. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తుండగా గణేష్, పవన్ కెరటాల్లో కొట్టుకుపోయారని వారి స్నేహితులు, పోలీసులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.. పండుగ రోజు తమ బిడ్డలు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఎంజాయ్ చేద్దామని బీచ్ దగ్గరకు వెళ్లిన యువకులంతా షాక్లో ఉన్నారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..