కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొయ్యూరు మండలం వైసీపీ నేత, జడ్పిటిసి వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు. భూమి విషయమై జరిగిన గొడవలో గిరిజనులు ఆయనను దారుణంగా హతమార్చారు. గిరిజనులు భూమి కోసం జడ్పీటీసీని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
పట్టా భూమి విషయంలో గిరిజనులతో వివాదం
రోలుగుంట మండలం చటర్జీ పురం వద్ద YSRCP ZPTC నూకరాజుకు పది ఎకరాల పొలం ఉంది. ఆ భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరిట ఉంది. అయితే ఆ భూమిని కొన్నేళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో గిరిజనులు ఒకసారి ఆయన మీద దాడి చేశారు. గాయపడిన నూకరాజు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స పొందిన తరవాత కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల సమయంలో పోలీసులు బైండోవర్ కేసులు కూడా నమోదు చేశారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం వైసీపీ జడ్పిటిసి నూకరాజు తన భూముల దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా భూమి సాగు చేస్తున్న గిరిజనులకు, వైసీపీ నేత నూకరాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది. మాట మాట పెరగడంతో గిరిజనులు దాడిచేసి జడ్పీటీసీ నూకరాజును హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంటం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నూకరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





