మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది.
మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహం పై లైంగిక దాడి జరిగింది. ఏడాదిన్నర తర్వాత సీసీఫుటేజీతో ఈ దారుణం బయటపడింది. బుర్హాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరగగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
స్ట్రెచర్పై ఉన్న మృతదేహాన్ని
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చురీలో ఉన్న మహిళ మృతదేహం ఉండగా.. స్ట్రెచర్పై ఉన్న మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్లి నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2024 ఏప్రిల్ 18న సాయంత్రం సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రెండ్రోజుల క్రితం పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో నిందితుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నీలేష్ భిలాలా(25) అరెస్ట్ చేశారు.
అయితే ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా.. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





