భాద్రపద మాసం అమావాస్యతో పితృ పక్షం పూర్తి అవుతుంది. ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారు. ఈ అమావస్యకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దీపాలను వెలిగించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇంట్లో ఈ ఆరు ప్రదేశాల్లో దీపాలను వెలిగించడం వలన పూర్వీకులు సంతోషించి దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలిగేలా దీవిస్తారు.
భాద్రప్రద మాసంలోని అమావాస్య తిథిని హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన ఫలవంతం అని నమ్మకం. అందులో ఒకటి ఇంట్లో దీపాలను వెలిగించడం. ఇలా దీపాలను వెలిగించి మన పూర్వీకులను స్మరించుకోవడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. కొన్ని ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని, కుటుంబానికి శుభం కలుగుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున కొన్ని ప్రదేశాల్లో దీపాలు వెలిగించడం ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆ ఆరు ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం..
పూర్వీకుల చిత్రం దగ్గర దీపం పూర్వీకుల చిత్రాల దగ్గర నువ్వుల నూనెతో లేదా నెయ్యి దీపం వెలిగించడం వారిని గౌరవించడానికి ఒక సులభమైన మార్గం. ఇది వారిని సంతృప్తిపరుస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదాలు ఇంటికి శాంతిని తెస్తాయి.
రావి చెట్టు కింద దీపం రావి చెట్టు త్రిముర్తులతో పాటు సకల దేవతలు, పూర్వీకుల నివాసంగా నమ్ముతారు. భాద్రప్రద అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. దురదృష్టం తొలగిపోతుంది. అదృష్టం పెరుగుతుంది.
Also read
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..
- Big breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు
- Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?