చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. బైరప్పకొట్టాలో భార్యను అతికిరాతకంగా నరికాడో భర్త. రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్తో కీర్తనకు వివాహం జరిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. బైరప్పకొట్టాలో భార్యను అతికిరాతకంగా నరికాడో భర్త. రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్తో కీర్తనకు వివాహం జరిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది కీర్తన. అయితే పుట్టింట్లోనే కీర్తనపై కత్తితో దాడిచేశాడు భర్త రాజేష్. కీర్తన కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. అనంతరం ఇంటి పైనుంచి దూకి బలన్మరణానికి ప్రయత్నించాడు రాజేష్. రాజేష్ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. కీర్తన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పిఎస్ ఆస్పత్రికి తరలించారు.
Also read
- పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమబద్ధీకరించాలి……ఐ.యఫ్.టి.యు.
- హైదరాబాద్లో మహిళలకు రక్షణ ఉండదా?
- తల్లి కుట్ర: చిన్న కొడుకుతో పెద్ద కొడుకు హత్యకు ప్లాన్
- తుపాకీతో కాల్చుకుని టీచర్ ఆత్మహత్య
- మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది





