రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న స్కూటీ డిక్కీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎర్వగూడకి చెందిన ప్రదీప్ గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ. 2.98 లక్షలు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ జనాలు ఎక్కువగా ఉండడంతో స్కూటీ డిక్కీలో దాచి, తిరిగి పనిచేసే వన్ ల్యాబ్కు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత బయటకు వచ్చిన అతను నగదు చూసుకోగా కనిపించలేదు. దుండగులు స్కూటీలోని నగదునున దోచుకెళ్లినట్లు గుర్తించిన ప్రదీప్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దుండగులు నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
- ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
- Hyderabad: ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
- అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
- `అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’
- బాబోయ్ మీరేం మనుషులురా..! అన్నదాత కష్టార్జితాన్ని కూడా వదిలి పెట్టరా..!





