అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన పీర్బాషా కుమార్తె షమీమ్బానకు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన పీర్బాషా కుమార్తె షమీమ్బానకు రాయచూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.
చేసింది. ఆమె తన బంగారాన్ని తాకట్టు పెట్టాడని, ప్రసవం దగ్గర పడింది వైద్యం చేయించాలని వీర్వోను కోరగా బెదిరించడంతో మోసపోయానని భావించింది. ఫోన్ కూడా బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురైన షమీమ్ బుధవారం రాత్రి విషం మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యలు గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈక్రమంలో మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. తన కుమార్తె మృతికి వీఆర్వో మహమ్మద్వలి కారణమని ఆమె తండ్రి పీరాబాషా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





