వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది.
వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది. ఇంటికి ప్రియుడిని పిలిచి మరీ లేపేసింది ఓ ఇల్లాలు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్ కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ప్రవళిక సంచలన ఆరోపణలు
అయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- పూజ గదిలో ఈ వస్తువు ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.. దీని విశిష్టత ఏంటంటే?
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు
- సిరిసిల్ల జిల్లా పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో దొంగతనంగా ధాన్యం బస్తాలను దోచుకుంటున్న దృశ్యాలు
- నల్గొండ క్వాడ్రపుల్ మర్డర్ మిస్టరీ… చివరికి దొరికిన హంతకులు!_
- వరంగల్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు





