ఆత్మకూరు (ఎం), భువనగిరి : సినీ ఫక్కీలో భర్తను హత్య చేయించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో నిందితుడు రామలింగస్వామి పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. (Crime News) కేసు వివరాలను డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి (38) హత్యకు గురయ్యాడు. భార్య స్వాతి తన ప్రియుడు సాయికుమార్, సోదరుడు మహేశ్తో కలిసి భర్తను చంపించింది. బైక్పై వెళ్తున్న స్వామిని కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. స్వాతి, సాయికుమార్, మహేశ్పై పోలీసులు హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 3 ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





