ఏపీకి చెందిన వల్లెపు రవి భవణ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండు సార్లు బైక్ మీద యాక్సిడెంట్ కావడంతో తల్లి బైక్ ఇవ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా బైక్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కన్నీటి పర్యాంతవుతోంది..
తల్లి బైక్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ధర్మవరం మండలానికి చెందిన వల్లెపు రవి భవణ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తనకు బైక్ కావాలంటే ఎంతో కష్టపడి తల్లి రమణమ్మ కొనిచ్చింది. అయితే ఈ యువకుడికి ఇటీవల రెండుసార్లు యాక్సిడెంట్ జరిగింది. మళ్లీ కుమారుడికి ఎక్కడ గాయాలు అవుతాయని భయంతో ఆ తల్లి బైక్ ఇవ్వలేదు.
బైక్ ఇవ్వలేదని..
దీంతో తల్లితో ఆ కొడుకు గొడవపడ్డాడు. అయిన కూడా రమణమ్మ బైక్ ఇవ్వకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కుమారుడికి ఏం కాకూడదని బైక్ ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కన్నీటి పర్యాంతమైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏడేళ్లు ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ వ్యవహారం నడిపించింది వరలక్ష్మి అనే యువతి.
ఇటీవల ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన ఎల్లేష్.. సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.తన ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని.. యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని చనిపోయే ముందు తన తల్లిదండ్రులను కోరాడు ఎల్లేష్.
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)