అనంతపురం జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన్ను లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది.
లక్ష్మీనారాయణ, అతని కుమారుడితో కలిసి ఇన్నోవా వాహనంలో గుంతకల్ నుండి చిప్పగిరికి వెళుతుండగా.. రైల్వే వంతెన సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు టిప్పర్ తో ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టి. తర్వాత కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణను వేట కొడవల్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది. అయితే కారులో ఉన్న అతని కుమారుడిని మాత్రం దుండగులు ప్రాణాలతో వదిలేశారు. ఈ ప్రమాదంలో అతని కుమార్ వినోద్ కూడా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





