భోగాపురం(విజయనగరం జిల్లా) : ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. భోగాపురం ఎస్ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం. ముంజేరు గ్రామానికి చెందిన మొగసాల శ్రావణి (19) విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థిని తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపారావు తెలిపారు
Also read
- అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!





