శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళను భర్త, అత్తమామలు, ఆడపడుచు దారుణంగా హింసించి చంపేశారు.
నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళను భర్త, అత్తమామలు, ఆడపడుచు దారుణంగా హింసించి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. కట్నం కోసం మహిళను భర్త హరికృష్ణ, అత్తమామలు నాగోరు, నర్సమ్మ, ఆడపడుచు నాగలక్ష్మి గత కొంతకాలంగా వేధిస్తున్నారు. పలుమార్లు ఆమెపై దాడి చేశారు. బాధితురాలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని వారిని హెచ్చరించింది. ఇలా చెప్పడంతో తాజాగా ఆమెపై మరోసారి దాడికి పాల్పడ్డారు. ఫిర్యాదు చేస్తుందని భయపడి రంగునీళ్లు తాగించి ఊపిరాడకుండా చేశారు. అనంతరం వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హతమార్చారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





