గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ లో బుధవారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ లోని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో వెళ్తున్న రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను స్థానికులు గమనించి జి ఆర్ పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని జిఆర్పి ఎస్ఐ నాగప్ప పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా అవుకు చెందిన మహేంద్ర (25) అనే యువకుడు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని జిఆర్పి ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు కారణాలను తెలియ రాలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో