ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ. ఈ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. కొడుకుని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. పోలీసులు అనుమానంతో విచారించగా నిజాన్ని ఒప్పుకుంది.
ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు.. సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ… ఈ ఘటన బిహార్లోని ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది. తన సొంత కుమారుడిని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అనుమానంతో బబితా దేవిని విచారించగా.. తామే కిడ్నాప్ చేశామని విచారణలో అంగీకరించింది. దీంతో బబితా దేవితో పాటుగా ఆమె ప్రియుడు నీతీశ్కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల బాలుడి మామ ఆదిత్య కుమార్ తన కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సరన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పి) కుమార్ ఆశిష్ తెలిపారు. రూ. 25 లక్షల ఇవ్వకపోతే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లమని చెప్పి బెదిరించినట్లుగా తెలిపారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





