అమరావతి : సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్కుమార్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గతంలో వేధించిన కేసులో సునీల్కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, జార్జియా, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుకె లాంటి దేశాలకు వెల్లడంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అనధికార విదేశీ ప్రయాణాలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేవిధంగా ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యేంత వరకు విజయవాడ వదిలి వెళ్లవద్దని సునీల్కుమార్ను ప్రభుత్వం ఆదేశించింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘనతోపాటు క్రమశిక్షణ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..