ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ గర్ లో జరిగింది.
హుజూర్నగర్ : ప్రేమిచడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన ఓ యువతి పట్టణంలోని ఆమె మేనమామ ఇంట్లో ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆ యువతితో పరిచయం ఉన్న ఆమె స్వగ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చింది. కోదాడ రోడ్డులో ఉన్న ఓ దుకాణం ఎదుట మాట్లాడుతుండగా తనను ఎందుకు ప్రేమించడం లేదని యువతితో గొడవపడిన ప్రమోద్ కుమార్ పెట్రోల్ పోశాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు పట్టించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Also read
- చచ్చే వయసులో ఇదేం పోయేకాలం .. షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు.. చివరకు
- ఫామ్హౌస్లో వీకెండ్ పార్టీ.. తెల్లారి స్విమ్మింగ్ పూల్లో తేలిన టెకీ డెడ్ బాడీ..! మిస్టరీగా మరణం
- పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది?
- పంచాంగంలో ఉన్న 5 అంగాల రహస్యం తెలుసా? వీటి ప్రభావం జీవితంపై ఎలా ఉంటుందంటే!
- దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర ఫలితాలపై శాస్త్రాల హెచ్చరిక!





